SRCL: పారిశుద్ధ్య కార్మికుల సేవ మరువలేనిదని రామచంద్రపూర్ సర్పంచ్ గంధం శ్రీనివాస్ అన్నారు. తంగళ్ళపల్లి మండలం రామచంద్రపురంలోని గ్రామపంచాయతీలో పారిశుద్ధ్య కార్మికులను ప్రజా ప్రతినిధులు ఆదివారం శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. గ్రామానికి పారిశుద్ధ కార్మికులు ఎంతో సేవ చేస్తారన్నారు. కరోనా సమయంలో సైతం తమ సేవలు అందించారన్నారు.