NZB: గిరిరాజ్ కళాశాలలో రేపు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ స్కిల్ అండ్ నాలెడ్జి, కెరీర్ గైడెన్స్ విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. టెక్ మహీంద్రా, మత్తూట్, జస్ట్ డైల్, టాటాఏఐజీ, మొదలైన కంపెనీలు ఇందులో పాల్గొంటాయన్నారు. ఆసక్తి గల యువత జాబ్ మేళాకు హాజరుకావాలని సూచించారు.