మన్యం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని పాత రెల్లి వీధిలో తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో మంటలు అంటుకోవడంతో ఓ వ్యక్తి సజీవ దహనం అయ్యాడు. మృతుడు బెహరా గొల్ల (55)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.