MBNR: కౌకుంట్ల మండల కేంద్రంలో సాగు చేస్తున్న యాసంగి పంటలు నీరు లేక ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న సర్పంచ్ ఉల్లి నరేశ్ కుమార్ తక్షణమే స్పందించి, పంటలను కాపాడేందుకు పెద్ద చెరువు నుంచి సాగునీటిని విడుదల చేశారు. దీంతో తమ పంటలు దక్కుతాయని రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కిషన్ రావు పాల్గొన్నారు.