ADB: జిల్లా జైలు పెట్రోల్ బంక్ రెండో వార్షికోత్సవం సందర్భంగా జైలు పర్యవేక్షకుడు గోపిరెడ్డి ‘ఆయిల్స్ మేళా మల్టీ గ్రేడ్’ను ప్రారంభించారు. ఈ మేళాలో ఇంజన్ ఆయిల్, బ్రేక్ ఆయిల్, గ్రీస్ వంటి ఉత్పత్తులపై 25% రాయితీ కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. స్టాక్ ఉన్నంత వరకు ఈ ఆఫర్ వర్తిస్తుందని, వాహనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.