తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ భారీగా పెరిగింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి సుమారు 21 గంటల సమయం పడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి నారాయణగిరి షెడ్డులలో భక్తులు వేచి ఉన్నారు. శనివారం మొత్తం 85,132 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే 38,855 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.6 కోట్లుగా నమోదైంది.