MHBD: జిల్లాలో కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో గౌడ కుల ప్రజాప్రతినిధుల సన్మానమహోత్సవ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. గౌడయువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గునిగంటి కమలాకర్ అద్యక్షతన జరిగిన ఈ సన్మానోత్సవంలో హైకోర్టు న్యాయవాది నలమాస కృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌడ ప్రజా ప్రతినిధులను సన్మానించారు. గాయకుడు మానుకోట ప్రసాద్ ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి.