AP: కూటమి ప్రభుత్వం అరకొరగా పథకాలు అమలు చేసి అన్ని ఇచ్చేశామని గొప్పలు చెప్పుకుంటోందని మాజీమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. రూ.3.27 లక్షల కోట్ల అప్పులు చేసిందని, రాష్ట్ర అప్పులపై కూటమి ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని అన్నారు. ఏ రంగాన్నీ వదిలిపెట్టకుండా చంద్రబాబు విచ్చలవిడిగా అప్పలు తెచ్చారని ఆరోపించారు.