VZM: జాతీయ లోక్ అదాలత్ సందర్బంగా కొత్తవలస జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో శనివారం కక్షీదారులతో కోర్టు హాల్ కిక్కిరిసిపోయింది. ఈ సందర్బంగా న్యాయమూర్తి డా. ఎస్. విజయ్ చందర్ మాట్లాడుతూ.. లోక్ అదాలత్ వలన కోర్టులు చుట్టూ తిరగకుండా సమయం, ఆదాయం ఆదా అవుతుందని, లోక్ అదాలత్ ఇచ్చిన తీర్పు అంతిమ తీర్పుగా భావించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు.