NLG: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాతృమూర్తి పేరుతో ఏర్పాటు చేసిన ‘కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో రేపు 13వ విడత ఉచిత కంటి వైద్య శిబిరం జరగనుంది. నాంపల్లి మండల ప్రజల కోసం మునుగోడులో ఈ శిబిరం నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 12 శిబిరాల ద్వారా 9,034 మందికి పరీక్షలు చేసి, 1,970 మందికి ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించినట్లు తెలిపారు.