VZM: లారీ కింద పడి డ్రైవర్ మృతి చెందిన ఘటన కొత్తవలస మండలం కంటకాపల్లి బొగ్గు యార్డ్ వద్ద శనివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. జమ్మాదేవిపేట గ్రామానికి చెందిన మొయ్యి శ్రీను బొగ్గు లోడింగ్ ఆనంతరం ప్రక్కకు వచ్చి తాడు కడుతున్నాడు. ఈ క్రమంలో తాడు తెగిపోవడంతో వెనక నుంచి వస్తున్న లారీ టైర్ కింద పడడంతో తల పగిలి అక్కడికక్కడే చనిపోయాడు.