WGL: హైదరాబాద్ సచివాలయంలో శనివారం రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కలిసి శాలువాతో సన్మానించారు. అనంతరం ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై చర్చించినట్లు తెలిపారు. నర్సంపేట అభివృద్ధికి సహకరించాల్సిందిగా వేం నరేందర్ని ఎమ్మెల్యే కోరారు.