ATP: జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య రక్షణ కోసం జిల్లా ఎస్పీ పి. జగదీష్ చొరవతో అనంతపురంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వైద్యుల బృందం పాల్గొని క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు, ఇతర ఆరోగ్య తనిఖీలు చేశారు. క్యాన్సర్ను ప్రాథమిక దశలో గుర్తిస్తే ప్రాణాపాయం తప్పుతుందని వైద్యులు ఈ సందర్భంగా అవగాహన కల్పించారు.