PDPL: ధర్మారం మండలంలో ఇవాళ జరిగిన టెన్త్ క్లాస్ తెలుగు పరీక్షకు 100% విద్యార్థులు హాజరయ్యారని ఎంఈఓ ప్రభాకర్ తెలిపారు. మొత్తం 5 కేంద్రాలలో 710 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావలసి ఉండగా 710 మంది హాజరయ్యారని ఆయన తెలిపారు. మొదటి రోజు ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని పేర్కొన్నారు.