GNTR: ఫిరంగిపురం గ్రామంలో పరిశుభ్రతపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన స్వచ్ఛ రథాన్ని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ శనివారం ప్రారంభించారు. ఇంటి వద్ద ఉన్న చెత్తను ప్రజలు వేరు చేసి ఈ వాహనానికి అందజేస్తే, దానికి బదులుగా నిత్యావసర సరుకులు అందజేయడం జరుగుతుందన్నారు. పరిశుభ్రతపై ప్రజల్లో చైతన్యం పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు.