MBNR: మహబూబ్ నగర్ ట్రిపుల్ ఐటీలో 2026 -27 విద్యా సంవత్సరానికి ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 16న అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఇంఛార్జ్ వీసీ గోవర్దన్ వెల్లడించారు. 18వ తేదీ నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభమై, ఏప్రిల్ 10 వరకు కొనసాగుతాయన్నారు. కాగా, మే 20, 30 తేదీల్లో ఎంపిక జాబితాలు విడుదల చేయనున్నట్లు తెలిపారు.