SKLM: ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్ రోడ్డులో శనివారం సీఐ ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఓ ద్విచక్రవాహనం పై 6 కిలోల గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద ఉన్న గంజాయిని ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. గంజాయి రవాణా చేసిన, విక్రయించిన కఠిన చర్యలు ఉంటాయని సీఐ అన్నారు