MDK: నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని ఏడవ వార్డులో వేసవి కాలం దృష్టిలో పెట్టుకొని నూతన బోరుబావికి మోటర్ బిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలకు నీరు వృథా చేయవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ వైస్ ఛైర్మన్ నయీముద్దీన్ పాల్గొన్నారు.