GDWL: జిల్లా కేంద్రంలో శనివారం వేడుకల కోలాహలం నెలకొంది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి తనయుడు బండ్ల సాయి సాకేత్ రెడ్డి, ఐశ్వర్య రెడ్డిల వివాహ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ముఖ్య మంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.