NGKL: జిల్లాలోని కేజీబీవీ విద్యార్థులకు పోటీ పరీక్షల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు అధికారిణి శోభారాణి తెలిపారు. బిజినపల్లిలో లాసెట్, వెల్దండలో నీట్, ఎంసెట్, నాగర్ కర్నూల్లో ఐఐటీ-జేఈఈ కోర్సులకు నిపుణులతో శిక్షణ ఇప్పించనున్నారు. గ్రామీణ విద్యార్థులు ఉన్నత విద్యలో రాణించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు.