HYD: మొయినాబాద్ నుంచి నార్సింగి వెళ్లే మార్గంలో ఉన్న నిర్మాణ ప్రాంతంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. సుమారు 50ఏళ్ల వయస్సు ఉన్న మహిళగా స్థానికులు గుర్తించారు. మృతికి గల కారణాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఘటనా స్థలానికి చేరుకున్న నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మహిళ ఎవరు? ఎలా మృతి చెందింది? అనేది తెలియాల్సి ఉంది.