JN: ఉప్పుగల్ గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి భూమిపూజ చేశారు. ఆంజనేయ స్వామి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో జీవించాలని ప్రార్థించారు. ఉప్పుగల్ గ్రామ ప్రజల ఆశీర్వాదంతో 30ఏళ్లుగా రాజకీయాలలో కొనసాగుతున్నానని, ఆలయ నిర్మాణానికి తన వంతు సహాయంగా లక్ష రూపాయలు విరాళంగా ప్రకటించారు.