NRPT: మార్చి 27న భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని మంత్రి వాకిటి శ్రీహరి దంపతులను దేవస్థాన అధికారులు ఆహ్వానించారు. శనివారం హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో మంత్రిని కలిసిన ఆలయ ఈవో, అర్చకులు ఆహ్వాన పత్రికను అందజేసి, వేడుకల్లో పాల్గొని సాంప్రదాయ రీతులను అనుసరించాలని సూచించారు.