VKB: పదో తరగతి విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని జిల్లా విద్యాధికారి రేణుకాదేవి సూచించారు. జిల్లా వ్యాప్తంగా 69 కేంద్రాల్లో 13,514 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు వెల్లడించారు. కేంద్రాల వద్ద తాగునీరు, విద్యుత్ వంటి అన్ని వసతులు కల్పించామని, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ అమలులో ఉంటుందని చెప్పారు.