PDPL: పాలకుర్తి రైతు వేదిక ఆవరణలో ఏర్పాటుచేసిన కార్య క్రమంలో రైతులకు నూతన సాంకేతిక వ్యవసాయ విధానాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రామగిరి ఖిల్లా శాస్త్రవేత్తల బృందం పాల్గొని విత్తనాలు, ఎరువుల వాడకం, నీటి నిర్వహణ, పంటల బీమా, మార్కెటింగ్ సౌకర్యాల గురించి వివరించారు. భూసార పరీక్షలు, ప్రకృతి వ్యవసాయం వల్ల కలిగే లాభాల గురించి అవగాహన కల్పించారు.