MHBD: జిల్లాలో నేటి నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలోని 45 కేంద్రాల్లో మొత్తం 8,157 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు జిరాక్స్ దుకాణాలు మూసివేయనున్నారు. విద్యార్థులు అరగంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్ స్నేహ శబరీష్ సూచించారు.