AKP: పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో గొలుగొండలో శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఎం నాయకుడు ఈరెల్లి చిరంజీవి మాట్లాడుతూ.. అంతర్జాతీయ పరిస్థితులను సాకుగా చూపించి గ్యాస్ ధరలను పెంచుతున్నారని విమర్శించారు. గ్యాస్ బ్లాక్లో అధిక ధరలకు అమ్ముతున్నారని, తక్షణమే ధరలను తగ్గించాలన్నారు