NGKL: రైతుల ఖాతాల్లోకి PM కిసాన్ 22వ విడత నిధులు జమ చేయడంపై కల్వకుర్తి బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం కల్వకుర్తి పట్టణంలోని పాలమూరు చౌరస్తాలో మండల బీజేపీ అధ్యక్షుడు మట్ట నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు, మహిళలు ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా కేంద్రం పనిచేస్తోందని వారు కొనియాడారు.