విశాఖ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం మహిళా ‘జన సున్వాయి’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శైలజ ముఖ్య అతిథిగా హాజరై వివిధ సమస్యలతో వచ్చిన మహిళల వినతులను స్వీకరించారు. వారి సమస్యలను విన్న అనంతరం సంబంధిత అధికారులకు పరిష్కారానికి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ పీడీ రామలక్ష్మి పాల్గొన్నారు.