KRNL: ఆదోనిలో గ్యాస్ సిలిండర్ల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని MLA పార్థసారథి శుక్రవారం హెచ్చరించారు. సివిల్ సప్లై అధికారులు, గ్యాస్ ఏజెన్సీలతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గృహ అవసరాల సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని తెలిపారు. వదంతులు నమ్మవద్దని, ఇబ్బందులు ఎదురైతే అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.