VSP: కవయిత్రి మొల్ల జయంతిని శుక్రవారం విశాఖ కలెక్టరేట్ మీటింగ్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి జేసీ గొబ్బిళ్ల విద్యాధరి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మొల్ల సాహిత్య సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ డైరెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.