MBNR: మిడ్జిల్ మండలంలో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని విగ్రహ కమిటీ సభ్యులు కోరారు. శుక్రవారం మాజీ మంత్రి లక్ష్మారెడ్డిని కలిసి వారు విన్నవించారు. స్పందించిన మాజీ మంత్రి విగ్రహ ఏర్పాటుకు రూ. 5,50,000 విరాళాన్ని ప్రకటించారు. అలాగే నూతనంగా నిర్మించనున్న గ్రంథాలయానికి కూడా తన వంతుగా సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.