MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం డ్రైడే, ఫ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. 99 రోజుల ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా 11వ వార్డులో పర్యటించిన మున్సిపల్ ఛైర్ పర్సన్, పాలకవర్గం సభ్యులు పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. కలుషిత నీరు తాగవద్దని సూచించారు. పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అని అన్నారు.