దేశవ్యాప్తంగా వాణిజ్య సిలిండర్ల కొరత హోటల్ వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలో చెన్నైలోని ఒక హోటల్ ఇడ్లీ, వడ ధరలతో పాటు అదనంగా గ్యాస్ ఛార్జీని కూడా బిల్లులో చేర్చడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గ్యాస్ ధరలు పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని, కస్టమర్లు సహకరించాలని హోటల్ యాజమాన్యాలు బోర్డులు పెడుతున్నాయి.