ప్రకాశం: ఈ నెల 16వ తేదీ నుంచి పాఠశాలల్లో ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నట్లు కంభం మండల ఎంఈఓ సత్తార్ తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు జరుగుతాయని చెప్పారు. పదో తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్న పాఠశాలలో మాత్రం మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహిస్తామని ఎంఈఓ తెలిపారు.