TG: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని దహెగాం రామాలయంలో అద్భుతం జరిగింది. హనుమాన్ దీక్షాధారులు పూజలు నిర్వహిస్తుండగా, ఓ వానరం నేరుగా ఆలయంలోకి ప్రవేశించింది. మంగళ హారతి ముగిసే వరకు శ్రద్ధగా కూర్చుని, అనంతరం స్వామి విగ్రహానికి మొక్కింది. అంతటితో ఆగక, తీర్థాన్ని తాగి వెళ్లిపోయింది. ఈ దృశ్యాన్ని చూసిన భక్తులు సాక్షాత్తూ ఆ బజరంగబలే వానర రూపంలో వచ్చి దర్శనమిచ్చారని పులకించిపోయారు.