CTR: రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టినట్లు కాణిపాకం ఎస్సై నరసింహులు తెలిపారు. ట్రాక్టర్లను నడిపేవారు నిబంధనలు పాటించాలని సూచించారు. బొమ్మసముద్రం, పైపల్లె గ్రామాలలో ట్రాక్టర్ డ్రైవర్లకు గురువారం అవగాహన కల్పించారు. రాత్రి సమయాలలో వాహనదారులకు ట్రాక్టర్లు స్పష్టంగా కనిపించేలా రేడియం స్టిక్కర్లు అతికించుకోవాలని సూచించారు.