PDPL: మంథని పట్టణంలోని కాకతీయ హై స్కూల్ విద్యార్థులు నేషనల్ సైన్స్ ఒలంపియాడ్ ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలంపియాడ్ పరీక్షల్లో విశేష ప్రతిభ కనబరిచారని ప్రిన్సిపల్ ప్రదీప్ రెడ్డి తెలిపారు. NSOలో 200 మంది పాల్గొని 146 మంది రెండో స్థాయికి ఎంపిక కాగా 128 మంది గోల్డ్ మెడల్స్ సాధించారని చెప్పారు. IMOలో 248 మంది పాల్గొని 74 మంది విద్యార్థులు ప్రతిభ చూపారు.