HYD: గచ్చిబౌలి పరిధిలోని శిల్ప లే అవుట్ వద్ద గోవా నుంచి LSD పేపర్లు తెచ్చి విక్రయిస్తున్నవారిని పోలీసులు పట్టుకున్నారు. సూరజ్ సింగ్, కస్టమర్ గోపీని శేరిలింగంపల్లి ఎస్ఓటీ పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుల వద్ద రూ. 80 వేల విలువైన 27 LSD పేపర్లు, కారు, స్కూటీ, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.