ఆసిఫాబాద్ జిల్లా DCC అధ్యక్షురాలు ఆత్రం సుగుణ ఆధ్వర్యంలో పెంచికల్ పేట్ మండల కేంద్రంలో మండల అధ్యక్ష దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా మండల నాయకులంతా సముద్రాల రాజన్నని ఏకగ్రీవం చేయాలని ప్రతిపాదించారు. దీంతో MLC విఠల్, DCC ఆత్రం సుగుణలు, పెంచికల్ పేట్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా రాజన్నని ఏకగ్రీవంగా నియమించారు.