MLG: సహజ ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతులు నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చని వెంకటాపురం మండలం మండల వ్యవసాయ అధికారి నవీన్ అన్నారు. బుధవారం మండలంలోని రాచపల్లి వ్యవసాయ క్షేత్రాలలో ప్రకృతి వ్యవసాయంపై నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొని వారు మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయంలో పెట్టుబడులు తగ్గి నాణ్యమైన దిగుబడులు వస్తాయన్నారు. రైతులు మొగ్గు చూపాలన్నారు.