WNP: వనపర్తిలో పీజీ కళాశాల విద్యార్థినీ విద్యార్థులు హాస్టల్ సౌకర్యం లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పీజీలో 350 విద్యార్థులకు వసతి గృహాల కొరకు రూ.1కోటి 50 లక్షలు మంజూరు చేయించడం జరిగింది అని తెలిపారు.