KMR: డోంగ్లీ మండలంలో నేటి నుంచి మూడు వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు సొసైటీ కార్యదర్శి బాబురావు తెలిపారు. ఉదయం 9:30కి మాధన్ హిప్పర్గ, 10 గంటలకు ఇలేగావ్, 11 గంటలకు సిర్పూర్ గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొనాలని బాబురావు కోరారు.