JN: జనగామ-సిద్దిపేట, జనగామ-సూర్యాపేట ప్రధాన రహదారులపై ఉన్న బ్రిడ్జిలపై సెంటర్ డివైడర్లను ఏర్పాటు చేయాలని BSP జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ… డివైడర్లను ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని, జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు.