MHBD: అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఐదుగురిని మరిపెడ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. అరకు(AP) నుండి లూనవత్ ప్రవీణ్, బోడా కార్తీక్, బాణోత్ శివ, అభిషేక్, ఒక మైనర్ బాలుడు అక్రమంగా గంజాయి తీసుకొని వచ్చి, మరిపెడలో అమ్ముదామని రాజీవ్ సెంటర్ వద్దకు వచ్చారు. నమ్మదగిన సమాచారంతో టాస్క్ ఫోర్స్ సీఐ హతిరాం ఆద్వర్యంలో వారిని పట్టుకొని, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు.