WNP: చిన్నంబావి, వీపనగండ్ల కేజీబీవీ పాఠశాలల్లో బుధవారం ’99 రోజుల ప్రజాపాలన’లో భాగంగా విద్యార్థులకు ప్రత్యేక ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు రక్తహీనత, చర్మ వ్యాధులు, కంటి సమస్యలను గుర్తించి అవసరమైన మందులను పంపిణీ చేశారు. మొత్తం 90 మంది విద్యార్థులకు వైద్య సేవలు అందించినట్లు వైద్య బృందం తెలిపింది.