ADB: నేరడిగొండ మండల కేంద్రంలో సాధు సమ్మేళన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో బోథ్ MLA అనిల్ జాదవ్ పాల్గొని గ్రామస్తులు కలిసి ఊరేగింపు కార్యక్రమం చేపట్టారు. సమాజంలో సత్ప్రవర్తన తీసుకురావడానికి శ్రీ శివానంద స్వామి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ధర్మాన్ని రక్షించుటకై ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.