SKLM: పదో తరగతి విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగే పబ్లిక్ పరీక్షల కోసం ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు జిల్లా ప్రజారవాణా అధికారి Ch. అప్పల నారాయణ తెలిపారు. విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపి పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో పరీక్షా కేంద్రాలకు ఉచితంగా చేరుకోవచ్చన్నారు.