SDPT: కోహెడ మండలం శనిగరంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కె.హైమావతి ఆకస్మికంగా సందర్శించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి నాణ్యతపై అసహనం వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం పోషకాహారం అందించాలని సిబ్బందికి హెచ్చరించారు. అనంతరం తంగళ్లపల్లి కస్తూర్బా పాఠశాలను కూడా తనిఖీ చేశారు.