MNCL: జైపూర్ మండలంలోని ఇందారం గ్రామంలో రూ. స30 లక్షల నిధులతో మూడు మహిళా సంఘ భవనాలకు రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి కృషి చేస్తోందని తెలిపారు. అనంతరం లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్నారు.